తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ మహా పురుషులకు ఇలా ఉరి వేసింది టెర్రరిస్టులేననేది సుస్పష్టం. టిఆర్ఎస్ అంటే తాలిబన్ రౌడీ పార్టీ అని సీమాంధ్ర నేతలు అనడానికి కారణం ఇప్పుడు ఉద్యమం బిజెపి, టిఆర్ఎస్ల చేతిలో లేదు. అది ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా వచ్చినా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల భవిష్యత్తు ఈ రౌడీల చేతిలో సురక్షితంగా ఉంటుందా?? ఇంత విధ్వంసం జరుగుతున్నా ఢిల్లిd పెద్దలు ఎందుకు చోద్యం చిత్తగిస్తున్నారు? అంటే ఎపి ''చే''జారిపోకూడదని? అదే జరిగితే సూట్కేసులు మరో రాష్ట్రం నుండి అందవు - అని''
వాము తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించకుంటూ కూర్చున్నాడని ఇంగ్లిష్లో ఓ సామెత అది నిజమేనని 2011లో మరోసారి భారత్లో రుజువు అయింది. పింగళి వెంకయ్య జాతీయ కాంగ్రెస్ పతాక నిర్మాత. నిస్వార్థ జీవితం గడిపిన పుణ్య పురుషుడు. ఆయన విగ్రహం నేలకూల్చడం రాక్షసులు చేసే పని. అంటే అరాజకం సృష్టించడానికి 'తెలంగాణ' ఉద్యమాన్ని టెర్రరిస్టులు ఒక 'సాకు' (ూస|ష|ష)గా వాడుకుంటున్నారు అనే సుస్పష్టం. మరి కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తున్నది? కారణం ఒకటే ఆంధ్రప్రదేశ్ 'చే'జారిపోతే వింధ్యకు దిగువన గల మొత్తం దక్షిణ భారతంలో కాంగ్రెస్ అన్న పేరు మిగలదు - ఇక రెండవ కారణం సోనియాగాంధీ, ఇందిరాగాధీ కాదు? ఈమెకు జాషువా, అన్నమయ్య, పింగళి వెంకయ్యల మీద ఎందుకు గౌరవం, ప్రేమాభిమానాలు ఉంటాయి?? ఎందుకంటే ఈమెకు ఈ దేశ చరిత్ర తెలియదు. అన్నమాచార్య అంటే అన్నము - చారు అనుకుంటుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా వెంకటేశ్వరస్వామి ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? బహుశ మన మత పెద్దలు అందుకే ఆయనకు కళ్లు కనపడకుండా తెల్లటి పట్టీలు వేశారు?! ''విగ్రహాల విధ్వంసం భావోద్రేకంతో తాత్కాలికంగా జరిగిన పని కాదు - ఆందోళనకారులు సుత్తెలు - బ్లేడ్లు తాళ్లతో ప్రణాళిక బద్ధంగా టాంక్బండ్కు చేరారు'' అని పోలీసు ఉన్నతాధికారి అకున్ సభర్వాల్ మార్చి 11వ తేదీ శుక్రవారం ప్రకటించారు. అంటే ఈ పుణ్య పురుషుల విగ్రహాలను తొలగించాలని చాలా ముందే ఉద్యమకారులు నిర్వహించుకున్నారని అందుకే టాంక్బండ్పై సమావేశ స్థలాన్ని నిర్ణయించుకొని పగులగొట్టిన విగ్రహాలను అన్నింటినీ హుస్సేన్సాగర్లో విసిరివేయాలని వ్యూహరచన చేశారనేది సుస్పష్టం. దీనికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కోరారు. అది జరిగే పని కాదు - శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని వాగ్దానం చేసి విధ్వంసం సృష్టించినందుకు కనీసం కెసిఆర్, కోదండ రాంలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి ఉండవలసింది.
''నాడు బాబ్రీ మసీదు వలె నేడు టాంక్బండ్పై విగ్రహాల ధ్వంసానికి బిజెపియే కారణం'' అని ఒక ఆరోపణ. విగ్రహాల ధ్వంసం సందర్భంలో జరిగిన ప్రత్యక్ష సంభాషణను ఒక పత్రిక ఇలా రిపోర్టు చేసింది. ఆందోళనకారులు విగ్రహాలు వరుసగా ధ్వంసం చేస్తూ శ్రీశ్రీ విగ్రహం వద్దకు వెళ్లారు. కాసింత డామేజ్ జరిగింది. ఇంతలో తోటి మిత్రులు వచ్చి 'ఇతడు మనవాడు. విప్లవ రచయిత - ఈ విగ్రహాన్ని ఏమీ చేయకండి' అన్నారు. దానితో ఆ విగ్రహాన్ని వదిలి పక్క విగ్రహం వద్దకు పోయారు. దీనిని బట్టి విగ్రహాలను ధ్వంసం చేసింది అతివాదులేనని సుస్పష్టం - కాకుంటే బాబ్రీ విధ్వంసం చేసింది శివసైనికులు వారేనని బిజెపి తెలియజేసింది. టాంక్బండ్ విగ్రహాల విధ్వంసం చేసింది విప్లవ విద్యార్థి సంఘాలు, ఎబివిపి బిజెపి వారు చెట్టాపట్టాలు వేసుకొని ఉద్యమం నడపుతున్నారు. అందువల్లనే ఈ ఆరోపణలు. కాకుల గూటిలో కోకిల ఉన్నా కోకిలను కాకి అనే అనుకుంటారు.
ఉద్యమ స్వరూపమేమిటి?
తెలంగాణా ప్రాంతం ఏడు వందల సంవత్సరాలు ముస్లిం పరిపాలనలో ఉంది. 1310 మాలిక్ కాఫర్ దండయాత్రలో కాకతీయ సూర్యుడు (ప్రతాపుడు) అంతరించాడు - నాటినుంచి 1948 వరకు తెలంగాణ ప్రజలు బానిసలుగా బతికారు. 'బాంచను దొరా నీ కాల్మొక్తా' అనేది ఇక్కడ నేటికీ ఊతపదం - వీరిని బానిసలు చేసింది ఎవరా!
1. ముస్లిం పాలకులు 2. రెడ్డిదొరలు 3. వెలమదొరలు. ఈ మూడూ ప్రధాన వర్గాలు. స్వాతంత్య్రం వచ్చాక వారికి స్వరాష్ట్ర కాంక్ష ఉండేది. ఐతై 'తెలుగు భాష మాట్లాడే వారంతా ఒకేచోట ఉండాలనే భాషా ప్రయుక్త రాష్ట్ర దృష్టిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర, సీమ, తెలంగాణ ప్రాంతాలను ఏకం చేశారు. ఇలా భౌగోళిక సమైక్యత వచ్చినా భావ సమైక్యత రాలేదూ ఇదే ప్రధాన కారణం.
ఇప్పుడు 2011లో తెలంగాణ ఉద్యమం నడుపుతున్నదెవరు? మళ్లిd రెడ్డి, వెలమ నాయకులే. 1969లో ఉద్యమం నడిపింది కూడా రెడ్డి నాయకులే బలి అయింది. అప్పుడు ఇప్పుడు (500్శ600) సామాన్యులు, అట్టడుగు వర్గాల వారు, విద్యార్థులు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా జైఆంధ్ర ఉద్యమం నడిపిన వారిలో కాకాని (ఉక్కు కాకాని బిరుదాంకితుడు) వంటి కమ్మవారు ప్రధాన పాత్ర పోషించారు.
ఇవాళ (2011) తెలంగాణా ఉద్యమంలో ఎవరెవరు ఎందుకు పాల్గొంటున్నారు?
(1) బిజెపి : ఆంధ్రప్రదేశ్లో బిజెపికి పట్టులేదు. ఆంధ్ర ప్రాంతంలో మరొక యాభై ఏళ్ళకు కూడా ఒక్క అసెంబ్లిd సీటు కూడా రాదు. తెలంగాణా ఉద్యమం ద్వారా ఇక్కడ కొన్ని పార్లమెంట్ సీట్లు సంపాదించుకోవాలని కోరిక.
(2) గద్దర్ : విప్లవ గాయకుడు - చత్తీస్గఢ్ ఉత్తర తెలంగాణా దండకారణ్యం కలిపి బృహత్ దండకారణ్య రెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని వారి లక్ష్యం.
కెసిఆర్, వెలమ దొర - కోల్పోయిన తమ ప్రాభవాన్ని పెత్తనాన్ని మళ్ళీ ఈ ఉద్యమం ద్వారా పునరుద్ధరించుకోవాలని కోరిక.
ఎంఐఎం : ప్రత్యేక రాష్ట్రం వస్తే బిజెపి బలపడుతుందని మత యుద్ధాలు వస్తాయని వారు సమైక్య రాష్ట్రం కోరుతున్నారు.
స్థూలంగా ఇదీ 2011 నాటి ఆంధ్ర - తెలంగాణా ఉద్యమ ముఖచిత్రం!!
'అన్నదమ్ముల్లా విడిపోదాం - విడిపోయి కలిసి ఉందా' అనే తియతియ్యని మాటలు చెప్పిన వారే 'ఆంధ్ర భాగో - తెలంగాణ జాగో' అనే నినాదాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలోనే ముస్లింలు ముప్పది లక్షలు ఆంధ్రులు మరొక ముప్పది లక్షలు - పార్సీ, కన్నడ, మహారాష్ట్ర, తమిళ, బెంగాలీ ఇత్యాది కాస్మా పాలిటన్ వర్గాలు మరొక పది లక్షలు ఉన్నారు. వీరెవరికీ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష లేదు. హైదరాబాద్ రాజధాని కావటం వల్ల అంతా ఇక్కడికి వచ్చారు. వీరంతా 'భాగో' అంటే విజయవాడకు, పాకిస్థాన్ను, బొంబయి, బెంగళూరు, కోల్కతా వంటి ప్రాంతాలకు పోవాలి. ఇదే ప్రధాన సమస్య!!
ఇక విగ్రహాలకు సంబంధించి మరికొన్ని విగ్రహాలు పెట్టాలి అని తెలంగాణావాదులు అడుగుతున్నారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు.
(1) పాల్కురికి సోమనాథుడు, (2) రావి నారాయణరెడ్డి, దాశరథి, కాళోజీ నారాయణరావు, విద్యానాథుడు చెర్విరాల భాగయ్య, మహామంత్రి మాదన్న, సర్వాయి పాపన్న ఇత్యాదుల విగ్రహాలు టాంక్బండ్ మీద లేకపోవడం లోపమే! వీరంతా తెలంగాణా ప్రాంతం వారే. ఇక్కడ చోటు చాలకపోతే నెక్లెస్ రోడ్డు వైపు మరికొన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు. అంతేకాని ఉన్న విగ్రహాలు కూల్చటం విద్రోహ చర్య.
అలాగే హైదరాబాద్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ, కొక్కొండ వెంకటరత్నం పంతులు (తొలి తెలుగు నవలా రచయిత) చిలకమర్తి లక్ష్మీనరసింహం, టి.ఎల్.కాంతారావు, మహానటి సావిత్రి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆనంద గజపతి, శ్రీనాథుడు అల్లసాని పెద్దన వంటి మరికొందరి విగ్రహాలు కూడా అటు నెక్లెస్ రోడ్వైపు పెట్టుకోవచ్చు.
'కెసిఆర్, కోదండరామ్లపై కేసులు పెడితే చాలదు వారిని అండమాన్కు (రాష్ట్రానికి) దూరంగా ఈ విచారణ పూర్తయ్యే వరకు పంపాలి' అని మంత్రి టి.జి. వెంకటేశ్ గారు (12-3-2011) ప్రకటించారు.
పాఠాలు - గుణపాఠాలు :
2011 మార్చి 10 గురువారం హైదరాబాద్లో టాంక్బండ్పై జరిగిన సంఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధానమైనది. బాబ్రీ మసీదు విధ్వంసం వంటి ప్రముఖ సంఘటన ఇది. దీని వలన చరిత్రకారులు కొన్ని పాఠాలు - గుణపాఠాలు విశ్లేషించి చరిత్రలో చేర్చవచ్చు.
(1) ఉద్యమం తీవ్రరూపంలో ఉన్నప్పుడు అది నాయకుల చేతిలో నుండి అదుపు తప్పుతుంది.
(2) లక్ష్యసాధన కోసం ఉద్యమకారులు విధ్వంస మార్గాలను ఎంచుకుంటారు.
(3) జాతి సంస్కృతి - సభ్యత - నాగరికతలను కూడా నిర్మూలించి లక్ష్యసాధన కోసం ముందుకు సాగవచ్చు.
(4) రాజకీయ లబ్ధి కోసం సిద్ధాంతాలకు తిలోదకాలు వదులుతారు. ఖద్దర్లూ - గద్దర్లూ కలుస్తారు. కాషాయం ఎర్ర రంగుగా మారుతుంది.
(5) లక్ష్యసాధన కోసం రాజకీయ నాయకులు (1) మతం, (2) ప్రాంతం, (3) భాష, యాన వంటి దురభిమానాలను రెచ్చగొట్టవచ్చు.
(6) మొత్తం మానవ చరిత్రలో ఎప్పుడైనా ఏ దేశంలోనైనా అధిపతులూ, వారి వారసులు, సంతతి, వంది మాగధులూ సుఖంగా ఉంటారు. భావోద్రేకాలను రెచ్చగొట్టి సామాన్యులను బలి పశువులను చేస్తూ ఉంటారు.
హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్, భింద్రేన్వాలా, కోదాడ రామరెడ్డి, కెసిఆర్, బాలథాక్రే, కరుణానిధి వంటి కొన్ని పేర్లు ఇందుకు ఉదాహరణలు.
(7) విధ్వంసకారులుకు మానవత్వం ఉండదు. లక్ష్యసాధన కోసం వందలాది ప్రజలను రెచ్చగొట్టి పోలీసు కాల్పుల్లో చంపిస్తారు లేదా భావోద్రేకాలలో ఆత్మాహత్యలు చేసుకునేటట్లు చేస్తారు.
(8) శాంతి, అహింస వంటి నీతులు పుస్తకాలకే పరిమితం. నిత్యజీవితంలో హింస, ద్వేషం ద్వారా విజయం సాధిస్తున్నారు.
(9) ఉద్యమ నిర్వహణకు సైద్ధాంతిక నిబద్ధత గల కార్యకర్తలను వాడుకోవచ్చు - లేదా మెర్సినరీస్ (కిరాయి వ్యక్తులను) వాడుకోవచ్చు.
(10) ఉద్యమానికి గాంధేయ మార్గంలో కార్యకర్తల నుండి వాలంటరీగా విరాళాలు సేకరించవచ్చు లేదా ధనిక వర్గాల నుండి నయాన - భయాన భారీ మొత్తాలు సేకరించవచ్చు. అందులో పెద్ద మొత్తాలు వ్యక్తిగత ప్రయోజనాలకు మిగుల్చుకోవచ్చు.
(11) ఉద్యమాలు అదుపు తప్పింది హింసాత్మకంగా మారితే అందుకు బాధ్యత ఇతరుల మీద లేదా పాలకుల మీద, రక్షక భటుల మీద నెట్టి తప్పించుకోవచ్చు.
ఉద్యమం అనే మాట 'యమ' అనే ధాతువుకు ఉత్ అనే ఉపసర్గ చేర్చటం వల్ల సిద్ధించింది. ఆంగ్లంలో మూవ్మెంట్ అనే పదం సమానార్థకంగా వాడుతున్నారు. యమ్ అంటే స్వాధీనంలో ఉంచుకొను అని అర్థం. కాని మానవ చరిత్రతో ఏ ఉద్యమమూ ఇంత వరకూ ఉద్యమ ప్రారంభకుల చేతిలో (సాత్వికంగా) ఉండలేరు. అతి త్వరగా స్వార్థపర శక్తులు, విచ్ఛిన్నకర శక్తులూ చొచ్చుకుపోతాయి. ఉద్యమం గాడి తప్పుతుంది. దారి తప్పుతుంది. ఫలితంగా ఉద్యమ సాధకుల తొలి ఆశయాలకు ఉద్యమం దూరంగా వెళ్లిపోతుంది.
- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్