- కిలో 56,900/-
ముంబై: మధ్య ప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న అనిశ్చితి వెండి ధరలను మరింతగా పెంచింది. గురువారం నాటి బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే 490 రూపాయలు పెరిగి 56,900 రూపాయలకు చేరి సరికొత్త ఆల్టైం రికార్డు స్థాయిని నమోదు చేసింది. దేశ రాజధానిలో ఇదే కాంట్రాక్టు ధర 600 రూపాయలు పెరిగి 56,600కు చేరింది. వెండి కొనుగోలుకు స్టాకిస్టులు, ఆభరణాల తయారీదారుల నుంచి మంచి మద్దతు వస్తుండటమే ధరలు పెరిగేందుకు కారణమైనాయని నిపుణులు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 80 రూపాయలు పెరిగి 20,875 రూపాయలకు, ఆర్నమెంట్ బంగారం 20,775 రూపాయలకు చేరింది. మరోవైపు యూరప్లో స్పాట్ గోల్డ్ధర ఔన్సుకు 1,428.90 డాలర్లకు, వెండి ధర 37.76 డాలర్లకు పెరిగింది.
No comments:
Post a Comment