- విజేతలకు జేజేలు..
- దేశాధినేతల అభినందనలు
- మిన్నంటిన ఉత్సాహంతో దీపావళిని తపించిన ఆనందకేళి
మొహాలీ: ప్రపంచకప్లో ధోనీసేన ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్-శ్రీలంకతో తలపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్ (85), సెహ్వాగ్ (38), రైనా (36 నాటౌట్) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. మిస్బా ఉల్ హక్ (59) ఒంటరి పోరాటం చేసినా పాక్ను ఫైనల్కు చేర్చలేక పోయాడు. మిగతావారిలో మహ్మద్ హఫీజ్ (43), అసద్ షఫీక్ (30), ఉమర్ అక్మల్ (29), ఆఫ్రిది (19) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జహీర్, నెహ్రా, మునాఫ్, హర్భజన్, యువరాజ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్లో రాణించిన మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, భారత్ ప్రపంచకప్ ఫైనల్కు చేరడం ఇది మూడోసారి. 1983లో కప్ సాధించిన టీమిండియా 2003 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
మొహాలి: ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం ఇక్కడ హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో భారత్ 29 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి తుది సమరానికి చేరుకొంది. ప్రపంచకప్లో ఫైనల్కు చేరుకోవడం భారత్కు ఇది మూడోసారి. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్-శ్రీలంకతో తలపడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాక్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్ (85), సెహ్వాగ్ (38), రైనా(36 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. మిస్బా ఉల్ హక్ (56) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాక్కు ఓపెనర్లు కమ్రాన్ అక్మల్, మహ్మద్ హఫిజ్ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 44 పరుగులు జోడించారు. అయితే 19 పరుగులు చేసిన కమ్రాన్ను జహీర్ పెవిలియన్పంపాడు. మరోవైపు హఫిిజ్ 59 బంతుల్లో 7ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. అసద్ షఫిక్ (30), ఉమర్ అక్మల్ (29) పరుగులు చేశారు. ఒంటరి పోరాటం చేసిన మిస్బా 75 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్స్తో 56 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో జహీర్, మునాఫ్, నెహ్రా, యువీ, భజ్జీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్లో రాణించిన మాస్టర్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సెహ్వాగ్ విధ్వంసం...
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్కు సచిన్-సెహ్వాగ్ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఉమర్గుల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సెహ్వాగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ ఓవర్లో ఐదు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. దీంతో భారత్కు ఏకంగా 21 పరుగులు దక్కాయి. తర్వాతి ఓవర్లోనూ టీమిండియాకు మరో 12 పరుగులు లభించాయి. ఐదో ఓవర్లో మరో 8 పరుగులు జట్టు ఖాతాలోకి వచ్చాయి. అయితే దూకుడుగా ఆడుతున్న సెహ్వాగ్ 25 బంతుల్లో 9ఫోర్లతో (38)ను వహాబ్ రియాజ్ పెవిలియన్ పంపాడు. వహాబ్ వేసిన అద్భుత బంతికి సెహ్వాగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 48 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రాణించిన సచిన్...
తర్వాత ఇన్నింగ్స్ మరమ్మతు బాధ్యతను సచిన్ తనపై వేసుకున్నాడు. గంభీర్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల ఆధిపత్యాన్ని అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పరుగుల వేగం తగ్గకుండా చూశారు. దీంతో భారత్ స్కోరు 15.2 ఓవర్లలో 100కు చేరుకొంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ సచిన్ 67 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అంతకుముందు అజ్మల్ వేసిన ఒక ఓవర్లో సచిన్ ఔటయ్యే ప్రమాదం నుంచి రెండుసార్లు తృటిలో తప్పుకున్నాడు. అజ్మల్ బంతికి సచిన్ను అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీనిపై మాస్టర్ రివ్యూకు వెళ్లాడు. దీంతో నాటౌట్గా తేలాడు. తర్వాతి బంతికి స్టంప్ ఔట్ నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. తర్వాత కూడా రెండుసార్లు సచిన్ ఇచ్చిన క్యాచ్ను పాక్ ఫీల్డర్లు జారవిడిచారు. మరోవైపు కుదురుగా ఆడుతున్న గంభీర్ (27) హఫిజ్ పెవిలియన్ పంపాడు. దీంతో 68 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 9 పరుగులు వహాబ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. తర్వాతి బంతికే యువరాజ్ (0) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ 141 పరుగుల వద్దే నాలుగో వికెట్ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సచిన్ పోరాటాన్ని కొనసాగించాడు. అయితే 115 బంతుల్లో 11 ఫోర్లతో 85 పరుగులు చేసిన సచిన్ను అజ్మల్ పెవిలియన్ పంపాడు. దీంతో సచిన్ వందో శతకాన్ని చూడాలని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ధోనీ (25), రైనా (36 నాటౌట్) మెరుగ్గా రాణించడంతో టీమిండియా 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో వహాబ్ ఐదు, అజ్మల్ రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ ఎల్బీ- వహాబ్ రియాజ్ 38, సచిన్ (సి) అఫ్రిది (బి) అజ్మల్ 85, గౌతమ్ గంభీర్ (స్టంప్డ్) కమ్రాన్ అక్మల్ (బి) మహ్మద్ హఫీజ్ 27, విరాట్ కోహ్లి (సి) ఉమర్ అక్మల్ (బి) వహాబ్ రియాజ్ 9, యువరాజ్ సింగ్ (బి) వహాబ్ రియాజ్ 0, ధోనీ ఎల్బీ-వహాబ్ రియాజ్ 25, సురేశ్ రైనా (నాటౌట్) 36, హర్భజన్ సింగ్ (స్టంప్డ్) కమ్రాన్ అక్మల్ (బి) అజ్మల్ 12, జహీర్ ఖాన్ (సి) కమ్రాన్ అక్మల్ (బి) వహాబ్ రియాజ్ 9, ఆశిశ్ నెహ్రా (రనౌట్) 1, మునాఫ్ పటేల్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు 18, మొత్తం 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు.
బౌలింగ్: ఉమర్ గుల్ 8-0-69-0, అబ్దుల్ రజాక్ 2-0-14-0, వహాబ్ రియాజ్ 10-0-46-5, సయీద్ అజ్మల్ 10-0-44-2, షాహిద్ అఫ్రిది 10-0-45-0, మహ్మద్ హఫీజ్ 10-0-34-1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: కమ్రాన్ అక్మల్ (సి) యువరాజ్ (బి) జహీర్ ఖాన్ 19, మహ్మద్ హఫీజ్ (సి) ధోనీ (బి) మునాఫ్ 43, అసద్ షఫిక్ (బి) యువరాజ్ 30, యూనిస్ ఖాన్ (సి) రైనా (బి) యువరాజ్ 13, మిస్బా (సి) కోహ్లి (బి) జహీర్ 56, ఉమర్ అక్మల్ (బి) హర్భజన్ 29, అబ్దుల్ రజాక్ (బి) మునాఫ్ 3, షాహిద్ అఫ్రిది (సి) సెహ్వాగ్ (బి) హర్భజన్ 19, వహబ్ రియాజ్ (సి) సచిన్ (బి) నెహ్రా 8, ఉమర్ గుల్ ఎల్బీ-నెహ్రా 2, అజ్మల్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు 8, మొత్తం 49.5 ఓవర్లలో 231పరుగులకు ఆలౌట్.
బౌలింగ్: జహీర్ ఖాన్ 9.5-0-58-2, ఆశిశ్ నెహ్రా 10-0-33-2, మునాఫ్ పటేల్ 10-1-40-2, హర్భజన్ సింగ్ 10-0-43-2, యువరాజ్ సింగ్ 10-1-57-2.
అభినందనల వెల్లువ
ప్రపంచకప్ ఫైనల్కు చేరుకున్న టీమిండియాపై అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్రప్రతి ప్రతిభాపాటిల్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తదితరులు భారత క్రికెట్ జట్టును అభినందించారు. సెమీస్లో పాకిస్తాన్ చిరస్మరణీయ విజయం సాధించిన ధోనీ సేన ఫైనల్లోనూ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, పిఆర్పి అధ్యక్షుడు చిరంజీవి తదితరులు కూడా టీమిండియాను అభినందించారు.
No comments:
Post a Comment