ముంబై : బాలీవుడ్ నటి పూనమ్ పాండే నగ్న ప్రదర్శన... ఎందుకంటారా అదేనండీ, మొన్నా మధ్య భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకుంటే... ఆ క్రీడామైదానంలోనే తాను నగ్నప్రదర్శన చేస్తానని పూనమ్పాండే సంచలన ప్రకటన చేశారు. అయితే అక్కడ కుదరలేదు. దీంతో పారిస్లో నగ్నప్రదర్శన చేస్తారంట. ఇంకేముంది, ప్రేమనగరంగా ఖ్యాతిగడించిన పారిస్కు బయలుదేరండి.
శనివారంనాడు ముంబై వాంఖేడ్ స్టేడియంలో భారత్ -శ్రీలంక జట్ల మధ్య సాగిన ఫైనల్ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, ప్రపంచకప్ కైవసం చేసుకుంది. అభిమానులంతా పూనమ్ పాండే కోసం వెతికారు. అయితే ఎక్కడా కనిపించలేదు. ఆమె సెల్ ఫోన్కు చేస్తే... స్విచ్ ఆఫ్ అనే సమాధానం వచ్చింది. దీంతో అభిమానులంతా నిరుత్సాపడ్డారు. అభిమానుల అభిలాషను పూనమ్ పాండే గుర్తించారో ఏమో కానీ, పారిస్లో నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించింది. నగ్నప్రదర్శన పూర్తిగా వ్యక్తిగతమైనది, పెద్దలకు ఇదొక చికిత్సాధ్యయనం లాంటిది, ఇది ఎంతమాత్రం నేరం కాదు’’ అని పూనమ్ పాండే పేర్కొన్నారు. ఈ మేరకు బిసిసిఐకి ఓ లేఖ రాసినట్లు కూడా ఆమె వెల్లడించారు. భారత్లో కాకుంటే, మరే దేశంలోనైనా తన నగ్నప్రదర్శనకు అవకాశం కల్పించాలని కూడా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించిన పూనమ్పాండేపై భోపాల్ కోర్టులో ఓ కేసు నమోదైంది. అంతేగాక ముంబై పోలీస్ కమిషనర్కు కూడా బిజెపి మహిళా నేత అరుప్ పట్నాయక్ ఫిర్యాదుచేశారు. ఆమెపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment