ముంబైకి కొచ్చి షాక్ !
ముంబై: ఐపిఎల్లో కొచ్చి టస్కర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో కొచ్చి 8వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబైకి ఇది ఓటమి కాగా, కొత్త జట్టు కొచ్చికి ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ 66 బంతుల్లోనే 12ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కొచ్చి 19 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకొంది. ఓపెనర్లు బ్రాండన్ మెకుల్లమ్ 60 బంతుల్లో 10ఫోర్లు, రెండు సిక్సర్లతో 81, మహేల జయవర్ధనే 36 బంతుల్లో 9ఫోర్లతో 56 పరుగులు సాధించి కొచ్చి విజయం కీలక పాత్ర పోషించారు. చివర్లో రవీంద్ర జడేజా 11 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25, హడ్జ్ 7 బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.
No comments:
Post a Comment